శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

- March 10, 2019 , by Maagulf
శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్‌:శంషాబాద్ విమానాశ్రయంలో బంగారు అక్రమంగా తరలిస్తున్న సుడాన్ దేశస్థురాలిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఆమె దగ్గర నుంచి 1.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ.55 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. శనివారం రాత్రి దుబాయ్ నుంచి హైదరాబాదుకు వచ్చిన సుడాన్ దేశస్థురాలి లగేజీని తనిఖీ చేశారు. బంగారాన్ని బిస్కెట్ల రూపంలో అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com