ఢిల్లీ:కారులో సజీవదహనమైన తల్లీకూతుళ్లు..
- March 11, 2019ఢిల్లీ:ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తల్లి సహా ఇద్దరు కూతుళ్లు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని అక్షర్ధామ్ ఫ్లైఓవర్పై జరిగింది. ఢిల్లీకి చెందిన ఉపేంద్ర మిశ్రా అతని భార్య, ముగ్గురు కూతుళ్లతో కలిసి పనిమీద బయటికి వెళ్లారు. అయితే కారు అక్షర్ధామ్ గుడివద్దకు రాగానే కారులో గ్యాస్ లీక్ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో డ్రైవర్ సీట్లో ఉన్న ఉపేంద్ర ఒక కూతురుని తీసుకుని బయటకు దూకేశాడు. అయితే మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడి భార్య రంజనా మిశ్రా, కూతుళ్లు నిక్కీ, రిధి సజీవదహనమయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా భార్య పిల్లలు కాలి బూడిద అవ్వడంతో ఉపేంద్ర ఎటువంటి సమాచారం ఇచ్చే పరిస్థితిలో లేడని పోలీసులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్
- 2 రోజులలో 884 విమానాలు రద్దు
- రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదే..
- జగన్ పై దాడి కేసులో నిందితులు అరెస్ట్