సౌదీ అరేబియా:బిడ్డను ఎయిర్పోర్ట్లోనే మరచిపోయి విమానమెక్కిన తల్లి!
- March 12, 2019సౌదీ అరేబియా: విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఏదో సాంకేతిక కారణాల వల్ల టేకాఫ్ అయిన విమానం నిమిషాల్లోనే తిరిగి దిగడం సాధారణమే. అయితే సౌదీ అరేబియాలోని జెడ్డా ఎయిర్పోర్ట్లో ఇలాగే ఓ విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే తిరిగి వచ్చింది. ఎందుకో తెలుసా.. ఆ విమానంలోని ఓ ప్రయాణికురాలు తన బిడ్డను ఎయిర్పోర్ట్లోనే మరచిపోయి విమానమెక్కింది. దీంతో విమానాన్ని మళ్లీ వెనక్కి తిప్పాలని అనుకుంటున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులకు విమాన సిబ్బంది సమాచారమిచ్చారు. సాధారణంగా ఎమర్జెన్సీ సమయాల్లోనే ఇలాంటి వాటికి అనుమతి ఇచ్చే ఎయిర్పోర్ట్లు ఈ విషయంలో ఏం చేయాలో తెలియక కాసేపు అయోమయానికి గురయ్యాయి. ఈ విమానం తిరిగి రావడానికి అనుమతివ్వాలని కోరుతోంది. ఎందుకంటే ఓ ప్రయాణికురాలు తన బిడ్డను ఎయిర్పోర్ట్లోనే మరచిపోయింది. మేము తిరిగి రావాలా వద్దా అని పైలట్ ఏటీసీని అడిగాడు. అయిలే పైలట్ ఏం చెప్పాడో అర్థం కాక..
సరైన కారణమేంటో మరోసారి చెప్పు అని ఆ ఆపరేటర్ ప్రశ్నించాడు. దీనికి మరోసారి పైలట్ నుంచి అదే సమాధానం వచ్చింది. దీంతో మరో దారి లేక విమానం తిరిగి రావడానికి ఏటీసీ అనుమతినిచ్చింది. విమానం దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ అధికారులు ఆ బిడ్డను తల్లికి అప్పగించారు.
తాజా వార్తలు
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం