వాట్సాప్ ప్లస్, జీబీ వాట్సాప్ల యూజర్లను బ్యాన్ చేసిన వాట్సాప్
- March 12, 2019వాట్సాప్ ప్లస్, జీబీ వాట్సాప్ల యూజర్లను బ్యాన్ చేస్తునట్లు ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ తెలిపింది. వినియోగదారుల నుంచి అందుతున్న ఫిర్యాదులు, భద్రతా కారణాల దృష్ట్యా ఆ వాట్సాప్లను వినియోగిస్తున్న యూజర్లను నిషేధించినట్లు వెల్లడించింది. ఈ అనుబంధ యాప్లను థర్డ్పార్టీ డెవలపర్లు తయారు చేశారు. అయితే, సమాచారాన్ని గోప్యంగా ఉంచడం, అధికారిక వాట్సాప్ నియమ నిబంధనలను, సేవలను అతిక్రమించడంతో ఈ చర్యలకు దిగినట్లు వాట్సాప్ పేర్కొంది. వినియోగదారులందరూ అధికారిక వాట్సాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఆ వెర్షన్లను వినియోగిస్తున్న వారు అధికారిక వాట్సాప్నకు ఎలా మారాలో కూడా సూచనలు చేసింది.
''మీ ఖాతా తాత్కాలికంగా నిలిపివేయబడింది' అని మీ వాట్సాప్నకు సందేశం వస్తే, మీరు అఫిషియల్ వాట్సాప్ను కాకుండా థర్డ్ పార్టీ తయారు చేసిన వాట్సాప్ను వినియోగిస్తున్నట్లు అర్థం. వాట్సాప్ను వినియోగించడానికి అధికారిక యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందే'' అని సంస్థ తెలిపింది. అదే సమయంలో ఇప్పటి వరకూ మీ స్నేహితులతో కొనసాగించని సంభాషణలన్నీ అఫిషియల్ వాట్సాప్కు బదిలీ చేసే విషయంలో గ్యారెంటీ ఇవ్వలేమని తెలిపింది. ఎందుకంటే అనధికార యాప్స్కు తాము మద్దతు తెలపమని స్పష్టం చేసింది.
మీరు ఏ వాట్సాప్ వాడుతున్నారో తెలుసుకోవాలంటే ఇలా చేయండి!
* Open your app.
* Go to 'More Options' GO
* Go to 'Settings'
* Tap on Help
* name from App info.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..