ట్యూషన్‌ ఫీజుల్ని పెంచిన ఇండియన్‌ స్కూల్‌

- March 13, 2019 , by Maagulf
ట్యూషన్‌ ఫీజుల్ని పెంచిన ఇండియన్‌ స్కూల్‌

మస్కట్‌: ఇండియన్‌ స్కూల్‌ మస్కట్‌, ఈ ఏడాది నుంచి ట్యూషన్‌ ఫీజుల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గల్ఫ్‌లో అతి పెద్ద కో-ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ అయిన ఇండియన్‌ స్కూల్‌ మస్కట్‌ 9,200 స్టూడెంట్స్‌ని కలిగి వుంది. ఇండియ్‌ స్కూల్‌ మస్కట్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ చౌహన్‌ జారీ చేసిన సర్క్యులర్‌లో నెలకు 1 ఒమన్‌ రియాల్‌ చొనప్పున ట్యూషన్‌ ఫీజుని పెంచుతున్నట్లు ప్రకటించారు. 2019-20 విద్యా సంవత్సరానికి ఈ పెంపుదల వర్తిస్తుంది. మరింత సమర్థవంతమైన నిర్వహణ దిశగా అందరి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు సర్క్యులర్‌లో పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com