ప్రధానమంత్రి విద్యాలక్ష్మీ ఎడ్యుకేషన్ లోన్

- March 13, 2019 , by Maagulf
ప్రధానమంత్రి విద్యాలక్ష్మీ ఎడ్యుకేషన్ లోన్

ప్రధానమంత్రి విద్యాలక్ష్మీ ఎడ్యుకేషన్‌ లోన్ స్కీమ్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్థిక‌స్థోమత తక్కువగా ఉన్న విద్యార్థులు పై చదువులు చదివేందుకు ఈ లోన్ సదుపాయం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. 
లోన్ సౌకర్యం పొందేందుకు విద్యార్థులకు ఉండవలసిన అర్హతలు..
ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. 
ఖచ్చితంగా భారతీయులై ఉండాలి. 
విద్యార్థుల తల్లిదండ్రులకు ఆదాయ సర్టిఫికెట్స్ ఉండాలి. 
లోన్ అప్లై చేసుకునే విధానం..
వెబ్‌సైట్‌లో www.vidyalakshmi.co.in‌ లో వ్యక్తిగత వివరాలన్నీ పొందుపరచాలి. 
ఈ వివరాలన్ని పరీక్షించిన తరువాత బ్యాంకులు మీరు లోన్ తీసుకునేందుకు అర్హులో కాదో నిర్ణయిస్తాయి. 
అర్హులైనట్లైతే నగదు నేరుగా మీరు ఇచ్చిన అకౌంట్‌లోకి చేరుతుంది. ఒకవేళ మీ అప్లికేషన్‌ని బ్యాంకు పెండింగ్‌లో పెట్టినట్లైతే మీ నుంచి మరిన్ని వివరాలు కోరుతుందని అర్థం. దాన్నిబట్టి ఇంకా ఏమైనా అప్లికేషన్‌లో ఫిల్ చేయకుండా వదిలేశారేమో చెక్ చేసుకోవాలి. ఇంకా ఇందులో విద్యార్థులు ఒకేసారి మూడు బ్యాంకుల్లో లోన్‌కి అప్లై చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. దీన్నీ బట్టి ఏ బ్యాంకులో వడ్డీ తక్కువ వుంటే ఆ బ్యాంక్ ద్వారా లోన్ తీసుకోవచ్చు. 
ప్రధానమంత్రి విద్యాలక్ష్మీ స్కీమ్‌లో ఉన్న బ్యాంకుల లిస్టును ఒకసారి పరిశీలిస్తే..
SBI
IDBI
BANK OF INDIA
CANARA BANK
UNION BANK OF INDIA
CORPORATION BANK
DENA BANK 
PUNJAB NATIONAL BANK
PUNJAB AND SINDH BANK 
ORIENTAL BANK OF COMMERCE 
CENTRAL BANK OF INDIA 
KOTAK MAHINDRA BANK 
VIJAYA BANK 
BANK OF BARODA
ANDHRA BANK 
FEDERAL BANK 
HDFC BANK 
ICICI BANK 
AXIS BANK 
UCO BANK 
INDIAN BANK 
BANK OF MAHARASTRA
INDIAN OVESEAS BANK 
RBL BANK 
SYNDICATE BANK 
ABHYUDAYA CO-OPERATIVE BANK LIMITED
DNS BANK 
KARUR VYSYA BANK 
TAMILNAD MERCANTILE BANK LTD

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com