బ్రెజిల్ లో కాల్పులు: 5 పిల్లలు సహా 9 మంది మృతి
- March 13, 2019బ్రెజిల్ లోని ఒక ఎలిమెంటరీ పాఠశాలలో తుపాకులు గర్జించాయి. ఈ సంఘటనలో ఐదుగురు పిల్లలు సహా 9 మంది మరణించారు. 17 మందికి పైగా గాయపడ్డారు. బుధవారం ఉదయం ఇద్దరు యువకులు కాల్పులు జరుపుతూ భవనంలోకి ప్రవేశించారని సావో పాలో పోలీసులు తెలిపారు. మరణించిన వారిలో ఐదుగురు స్కూలు పిల్లలు, భవనంలో పనిచేసే వ్యక్తి, స్కూలు బయట నిలబడిన మరొకరు, ఇద్దరు షూటర్లు ఉన్నట్టు పోలీసులు చెప్పారు.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు ముఖానికి మాస్కులు వేసుకున్న ఇద్దరు యువకులు కాల్పులు జరుపుతూ రౌల్ బ్రెసిల్ ఎలిమెంటరీ పాఠశాల భవనంలోకి ప్రవేశించారు. చివరకు వారు తమను తామే కాల్పుకుని చనిపోయారు. ఈ కాల్పుల్లో కనీసం 17 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో చాలా మంది పిల్లలు ఉన్నారు. గాయపడిన వారిని హాస్పిటళ్లకు తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలియ రాలేదు. అంతకు ముందు ఈ స్కూల్ కి 500 మీటర్ల దూరంలో మరో షూటింగ్ జరిగింది. అయితే ఈ రెండిటికి సంబంధం ఉందా లేదా అనేది తెలియడం లేదు.
ప్రపంచంలోనే అత్యంత హింసాత్మక దేశాల్లో ఒకటిగా పేరున్న బ్రెజిల్ లో స్కూల్ షూటింగ్స్ చాలా అరుదుగా జరుగుతుంటాయి. చివరిసారి రియో డి జెనిరోలో 2011లో జరిగిన స్కూల్ షూటింగ్ లో 12 మంది మరణించారు.
తాజా వార్తలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్