బ్రెజిల్ లో కాల్పులు: 5 పిల్లలు సహా 9 మంది మృతి

- March 13, 2019 , by Maagulf
బ్రెజిల్ లో కాల్పులు: 5 పిల్లలు సహా 9 మంది మృతి

బ్రెజిల్ లోని ఒక ఎలిమెంటరీ పాఠశాలలో తుపాకులు గర్జించాయి. ఈ సంఘటనలో ఐదుగురు పిల్లలు సహా 9 మంది మరణించారు. 17 మందికి పైగా గాయపడ్డారు. బుధవారం ఉదయం ఇద్దరు యువకులు కాల్పులు జరుపుతూ భవనంలోకి ప్రవేశించారని సావో పాలో పోలీసులు తెలిపారు. మరణించిన వారిలో ఐదుగురు స్కూలు పిల్లలు, భవనంలో పనిచేసే వ్యక్తి, స్కూలు బయట నిలబడిన మరొకరు, ఇద్దరు షూటర్లు ఉన్నట్టు పోలీసులు చెప్పారు.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు ముఖానికి మాస్కులు వేసుకున్న ఇద్దరు యువకులు కాల్పులు జరుపుతూ రౌల్ బ్రెసిల్ ఎలిమెంటరీ పాఠశాల భవనంలోకి ప్రవేశించారు. చివరకు వారు తమను తామే కాల్పుకుని చనిపోయారు. ఈ కాల్పుల్లో కనీసం 17 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో చాలా మంది పిల్లలు ఉన్నారు. గాయపడిన వారిని హాస్పిటళ్లకు తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలియ రాలేదు. అంతకు ముందు ఈ స్కూల్ కి 500 మీటర్ల దూరంలో మరో షూటింగ్ జరిగింది. అయితే ఈ రెండిటికి సంబంధం ఉందా లేదా అనేది తెలియడం లేదు.

ప్రపంచంలోనే అత్యంత హింసాత్మక దేశాల్లో ఒకటిగా పేరున్న బ్రెజిల్ లో స్కూల్ షూటింగ్స్ చాలా అరుదుగా జరుగుతుంటాయి. చివరిసారి రియో డి జెనిరోలో 2011లో జరిగిన స్కూల్ షూటింగ్ లో 12 మంది మరణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com