ఫస్ట్ లిస్ట్ను రిలీజ్ చేసిన పవన్కళ్యాణ్
- March 14, 2019జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది… 32మంది పేర్లతో ఫస్ట్ లిస్ట్ను రిలీజ్ చేశారు పవన్కళ్యాణ్… అలాగే నలుగురు పార్లమెంట్ అభ్యర్థులను కూడా ఖరారు చేశారు… ఇవాళ రాజమండ్రిలో ఆవిర్భావ సభ నిర్వహిస్తుండగా తొలి జాబితా విడుదల చేయడం గమనార్హం… మరోవైపు జనసేన, వామపక్షాల మధ్య పొత్తు చర్చలు ఈ నెల 16న కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి…
ఏపీలో అభ్యర్థుల జాబితా విడుదలలో మొదట నిలిచింది జనసేన పార్టీ… మొత్తం 32 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బుధవారం అర్థరాత్రి దాటాక పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు… అసెంబ్లీ అభ్యర్థులతోపాటు నలుగురు పార్లమెంట్ సభ్యులను కూడా ఖరారు చేశారు…..
ముందే ప్రకటించినట్టుగా రాజమండ్రి నుంచి ఆకుల సత్య నారాయణ, అమలాపురం నుంచి డీఎంఆర్ శేఖర్ ఎంపీగా పోటీ చేయనున్నారు. విశాఖ నుంచి గేదెల శ్రీనుబాబు, అనకాపల్లి నుంచి చింతల పార్ధసారథి ఎంపీలుగా పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది. ఇక ఎమ్మెల్యేల జాబితా విషయానికి వస్తే.. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, గుంటూరు వెస్ట్ నుంచి తోట చంద్రశేఖర్, మమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణల పేర్లను పవన్ ఇంతకు ముందే ప్రకటించారు.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA