పాక్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డ జూనియర్ భుట్టో
- March 14, 2019ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో విరుచుకుపడ్డారు. పాక్ను ప్రపంచానికి శత్రుదేశంగా మార్చేశారని ఆరోపించారు. ఇండియా-పాకిస్థాన్ మధ్య నెలకొన్న పరిస్థితులపైనా ఆయన మాట్లాడారు. ఉగ్ర సంస్థలకు పాక్లో స్థానం ఉండబోదని ఇమ్రాన్ అన్న వ్యాఖ్యలపై స్పందించారు.
' పాకిస్థాన్తో క్రమంగా అన్ని దేశాలు సంబంధాలు తెంచుకుంటున్నాయి. ప్రధాని ఇమ్రాన్ తీసుకుంటున్న చర్యల వల్లే ఇదంతా. ఉగ్రవాద నియంత్రణకు చర్యలు తీసుకుంటుంటే ప్రపంచ దేశాలు పాక్పై ఎందుకు మండిపడుతున్నాయి? ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులకు నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయి.ఇండియా-పాక్ మధ్య ఎప్పటి నుంచో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువయ్యాయి? మీరు(ఇమ్రాన్) నిజంగా శాంతిని కోరుకుంటుంటే ముందు ప్రపంచ దేశాల ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు ఉగ్రవాద నియంత్రణ పట్ల నిజాయతీగా ఉన్నట్లయితే మేం చెప్పే మూడు విషయాలను తీవ్రంగా తీసుకోండి. 'పార్లమెంట్ నేషనల్ సెక్యూరిటీ కమిటీని నియమించండి', 'నిషేధిత ఉగ్రవాద సంస్థలకు మద్దతివ్వడం ఆపేయండి. లేదా వారికి దూరంగా ఉండండి', ' మీ మంత్రి వర్గంలో ఉండి నిషేధిత సంస్థలతో బంధాలు కొనసాగిస్తున్న వారిపై విచారణ జరిపి వారిని తొలగించండి'.. ఈ మూడు చర్యలు ప్రభుత్వం తీసుకుంటే ఉగ్రవాద నియంత్రణకు పాక్ ప్రభుత్వం కృషి చేస్తుందని మాతో పాటు అందరూ నమ్ముతారు' అని భుట్టో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 22న పదవ తరగతి ఫలితాలు విడుదల
- T20 వరల్డ్కప్.. ఏప్రిల్ 28న భారత జట్టు ఎంపిక..!
- ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి: జస్టీస్ చంద్రచూడ్
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం