ముంబై లో విషాదం.. కూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్..
- March 15, 2019ముంబైలో విషాదం చోటు చేసుకుంది. ప్రఖ్యాత ఛత్రపతి శివాజీ టర్మినల్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. సీఎస్టీలోని ప్లాట్ ఫాం నెంబర్-1 నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియా సమీపంలోని బీటీ లేన్ ను కలిపే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అకస్మాత్తుగా కుప్పకూలింది. సాయంత్రం బిజీగా ఉన్న సమయంలో పాదచారుల వంతెన ఒక్కసారిగా కూలడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.
ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బ్రిడ్జ్ కూలిన ఘటనతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్కు అంత రాయం ఏర్పడటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
ఇదిలా ఉంటే, ప్రమాదానికి గురైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రిపేర్ లో ఉన్నట్లు సమాచారం. ఉదయమే ఆ వంతెనకు మరమ్మతులు చేసినట్లు తెలు స్తోంది. రిపేరింగ్ పనులు పూర్తి కానప్పటికీ ప్రజలు ఆ వంతెనపై నుంచే వెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు