ఒమన్‌ బోట్‌ ట్రాడెడీ: చివరి మృతదేహం లభ్యం

- March 15, 2019 , by Maagulf
ఒమన్‌ బోట్‌ ట్రాడెడీ: చివరి మృతదేహం లభ్యం

మస్కట్‌: హృదయ విదారకమైన బోట్‌ యాక్సిడెంట్‌కి సంబంధించి చివరి మృతదేహాన్ని ఎట్టకేలకు అధికారులు కనుగొన్నారు. రాయల్‌ ఒమ్‌ పోలీస్‌ ఈ విషయాన్ని ధృవీకరించింది. విలాయత్‌ ఆఫ్‌ మహౌత్‌ షోర్‌లైన్‌లో ఈ మృతదేహాన్ని కనుగొన్నారు. మార్చి 8న ఆరుగురు ఒమనీ పౌరులు, వలాయత్‌ ఆఫ్‌ మహౌత్‌ మీదుగా ఫిషింగ్‌ ట్రిప్‌కి వెళ్ళారు. ఈ క్రమంలో బోటు మునిగిపోయింది. స్థానికంగా వున్నవారు ఈ ప్రమాదాన్ని గుర్తించి, ఇద్దర్ని రక్షించగలిగారు. అయితే మరో ఇద్దర్ని మాత్రం కాపాడలేకపోయారు, వారి మృతదేహాల్ని బయటకు తీసుకొచ్చారు. మరో ఇద్దరు గల్లంతు కాగా, అందులో ఒకరి మృతదేహం బుధవారం దొరికింది. ఇప్పుడు మరో మృతదేహం దొరికిందని, ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని రాయల్‌ ఒమన్‌ పోలీసులు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com