ఒమన్ బోట్ ట్రాడెడీ: చివరి మృతదేహం లభ్యం
- March 15, 2019మస్కట్: హృదయ విదారకమైన బోట్ యాక్సిడెంట్కి సంబంధించి చివరి మృతదేహాన్ని ఎట్టకేలకు అధికారులు కనుగొన్నారు. రాయల్ ఒమ్ పోలీస్ ఈ విషయాన్ని ధృవీకరించింది. విలాయత్ ఆఫ్ మహౌత్ షోర్లైన్లో ఈ మృతదేహాన్ని కనుగొన్నారు. మార్చి 8న ఆరుగురు ఒమనీ పౌరులు, వలాయత్ ఆఫ్ మహౌత్ మీదుగా ఫిషింగ్ ట్రిప్కి వెళ్ళారు. ఈ క్రమంలో బోటు మునిగిపోయింది. స్థానికంగా వున్నవారు ఈ ప్రమాదాన్ని గుర్తించి, ఇద్దర్ని రక్షించగలిగారు. అయితే మరో ఇద్దర్ని మాత్రం కాపాడలేకపోయారు, వారి మృతదేహాల్ని బయటకు తీసుకొచ్చారు. మరో ఇద్దరు గల్లంతు కాగా, అందులో ఒకరి మృతదేహం బుధవారం దొరికింది. ఇప్పుడు మరో మృతదేహం దొరికిందని, ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని రాయల్ ఒమన్ పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత