'పీఎం కిసాన్' రెండోవిడత ఆర్థికసాయం!
- March 24, 2019న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రెండో విడత నగదు బదిలీ ఏప్రిల్ 1 నుంచి జరగనున్నట్లు తెలుస్తోంది. మార్చి 10న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ముందే ఈ పథకం కింద 4.74 కోట్ల మంది చిన్న,సన్నకారు రైతులను ఎంపిక చేశారు. ఇప్పటికే 2.74 కోట్ల మంది ఖాతాల్లో తొలివిడతగా రూ.2000 చొప్పున జమచేశారు. మిగతావారి ఖాతాల్లోనూ ఈనెలాఖరులోగా నగదు జమ చేసేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈప్రక్రియను కొనసాగించేందుకు ఈసీ నుంచీ అనుమతులొచ్చినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ పథకం ద్వారా అత్యధిక సంఖ్యలో రైతులు లబ్ధిపొందుతున్న తొలి 3 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా ఉన్నాయి.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!