పాక్ లో హిందూ అమ్మాయిల కిడ్నాప్ కలకలం..
- March 25, 2019పాకిస్థాన్లో హిందూమతానికి చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్ల అపహరణ-బలవంతపు మతమార్పిడి ఉదంతం తీవ్ర కల కలం రేపుతోంది. ఈ వ్యవహారం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించే ప్రమాదమున్న నేపథ్యంలో 2 దేశాల ప్రభుత్వాలు సీరియస్గా స్పందించాయి. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక పంపాలని పాకిస్థాన్లోని భారత రాయ బారి ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఈ ఘటనపై మీడియా కథ నాలను పొందుపరుస్తూ పాక్లోని భారత హైకమిషనర్కు వివరాలు అందించారు. పాకిస్థాన్ ప్రభుత్వం కూడా ఈ ఘటనపై దృష్టి సారించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఆదేశించింది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో హోళీ పండుగ రోజున ఇద్దరు అక్కాచెల్లెళ్లు కిడ్నాపయ్యారు. ఘోట్కీ జిల్లా ధర్కి పట్టణంలో జిల్లాలో రవీనా, రీనాలను ఇంటి నుంచే కొందరు వ్యక్తులు అపహరించారు. తర్వాత వారికి వివాహం చేసి ముస్లిం మతంలోకి మార్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో కలకలం రేగింది. హిందూ బాలికలను అపహరించి బలవంతంగా మతం మార్చారంటూ హిందూ సంఘాలు ఆందోళన చేశాయి. ఇందుకు కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!
- మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్ బాబా
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ