శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ ESL నరసింహన్ దంపతులు
- April 09, 2019తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని రెండు తెలగు రాష్ట్రాల గవర్నర్ ESL నరసింహన్ దంపతులు మంగళవారం దర్శిచుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో గవర్నర్ దంపతులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు వారు క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవరాహస్వామిని దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులు శ్రీవారి పుష్కరిణిలోకి చేరుకొని పవిత్ర జలాలను ప్రోక్షణం చేసుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు తితిదే ఈవో అనిల్కుమార్ సింఘాల్, తిరుమల ఇన్ఛార్జి జేఈవో లక్ష్మీకాంతం ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి, మేళతాళాలతో శ్రీవారి సన్నిధికి తీసుకెళ్లారు. స్వామి వారి దర్శనానంతరం హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం పలుకగా తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని గవర్నర్ దంపతులకు తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ , జేఈవో లక్ష్మి కాంతం అందజేసి సత్కరించారు.
తాజా వార్తలు
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్