తమ్ముడిని గదిలోకి తీసుకెళ్లి.. అక్క నీచంగా..
- April 09, 2019బ్రెజిల్:స్మార్ట్ యుగం లో ఒకవైపు యువత టెక్నాలజీతో పరుగెడుతూ ఉంటే.. మరోవైపు కొందరు క్షుద్రపూజలతో అభంశుభం తెలియని చిన్నారులను బలితీసుకుంటున్నారు. అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి వస్తున్న ఈ కాలంలో కూడా కొందరు మూఢనమ్మకాలు, క్షుద్రపూజలు అంటూ అమాయకులను పొట్టనపెట్టుకుంటున్నారు. మానవాతీత శక్తులు పొందాలని ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. సొంత తమ్ముడు అనే జాలి లేకుండా.. ఘోరంగా చంపేసి.. అతని మర్మాంగాలను కోసుకుని తినేసింది. బ్రెజిల్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
బ్రెజిల్కు చెందిన ఓ మహిళ.. కూతురు, కొడుకుతో కలిసి నివాసముంటుంది. 18 ఏళ్ల కూతురుకి చిన్నతనం నుంచి క్షుద్రపూజలంటే ఎంతో ఆసక్తి. మానవాతీత శక్తులు పొందాలని ఎంతో ఆసక్తిగా వీడియోలు చూసేది. వయస్సుతో పాటు తనలో మూఢనమ్మకాలు విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ రోజు తల్లి మార్కెట్కు వెళుతూ 5ఏళ్ల తమ్ముడిని చూసుకొమ్మని చెప్పింది. తమ్ముడితో ఆడుతున్న సమయంలో ఆమెలో దాగివున్న మూఢనమ్మకం నిద్రలేచింది. దీంతో తమ్ముడిని వీడియో గేమ్ ఆడదామని తన బెడ్రూమ్లోకి తీసుకెళ్లింది. గదిలోకి తీసుకెళ్లి, తమ్ముడిని దిండుతో ఊపిరాడనివ్వకుండా చంపేసింది. తర్వాత అతడి మర్మాంగాలను కోసుకుని తినేసింది. తమ్ముడి శవం చుట్టూ కొవ్వొత్తులు వెలిగించి.. మధ్యలో కూర్చొని పూజలు చేసింది.
ఇంతలో మార్కెట్కి వెళ్లి.. తిరిగివచ్చిన తల్లి.. లోపల కనిపించిన దృశ్యాలను చూసి షాకైంది. స్థానికుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె గదిలో డ్రగ్స్ దొరకడంతో.. డ్రగ్స్ మత్తులో ఇలా చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆమె మొబైల్ మంటల్లో కాలిపోవడం.. మెమరీకార్డుని కూడా ఆమె కాల్చి బూడిద చేయడం విశేషం. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.
« Older Article World’s top U-16 players to compete for Dubai International Football Championship title
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14