శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా పట్టుబడ్డ బంగారం

- April 14, 2019 , by Maagulf
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా పట్టుబడ్డ బంగారం

హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయం లో అధికారులు జరిపిన తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. దోహా నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా అతని వద్ద అక్రమంగా తరలిస్తున్న 1,900 గ్రాముల బంగారం పట్టుబడింది. బంగారాన్ని లో దుస్తుల్లో దాచుకుని వస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. పట్టుబడిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు రూ.36,99,782 ఉంటుందని అంచనా వేశారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com