కువైట్ విమానాశ్రయంలో బాంబు కలకలం
- April 15, 2019కువైట్: కువైట్ విమానాశ్రయంలో ఓ గుర్తు తెలియని పార్శిల్ కలకలం సృష్టించింది. కువైట్ నుంచి అమెరికాకు దాన్ని కొరియర్ చేసినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఓ పుస్తకం సైజులో ఉన్న ఆ పార్శిల్ ఏంటో, ఎవరు పంపారో వివరాలు తెలియరాలేదు. ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ ఆ ప్యాకేజిని పరిశోధించడానికి ఫోరెన్సిక్ నిపుణులకు పంపించింది. రొటీన్ కార్గో చెకింగ్లో భాగంగా కొరియర్ చేస్తున్న వస్తువులను పరిశీలిస్తుండగా ఈ అనుమానాస్పద పార్శిల్ బయటపడిందని అధికారులు తెలిపారు. ఈ పార్శిల్లో బాంబు ఉందేమోనని వారు అనుమానిస్తున్నారు. ఎందుకంటే పార్శిల్లో బ్యాటరీలు, డైనమైట్ తయారీలో ఉపయోగించే టీఎన్టీ అనే పదార్థం ఉన్నాయని స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆ పార్శిల్ను పరిశీలించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు