త‌మిళ‌నాడు పోలింగ్‌.. ఓటేసిన సినీ ప్రముఖులు

- April 18, 2019 , by Maagulf
త‌మిళ‌నాడు పోలింగ్‌.. ఓటేసిన సినీ ప్రముఖులు

దేశంలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల రెండో ద‌శ పోలింగ్ ఈ రోజు (గురువారం) ఉద‌యం ఏడు గంట‌ల‌కు ప్రారంభ‌మైంది. దేశంలోని 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 95 నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండో ద‌శ పోలింగ్ జ‌రుగుతోంది. సామాన్య ప్ర‌జ‌ల‌తోపాటు సినీ ప్ర‌ముఖులు కూడా ఓటేసేందుకు క్యూ క‌ట్టారు. త‌మిళ ప్ర‌ముఖ న‌టులు సూర్య‌, కార్తి, జ్యోతిక క్యూలో నిల‌బ‌డి త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అలాగే సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ ఓటేసేందుకు ముంబై నుంచి త‌మిళనాడు వ‌చ్చారు. మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, విశ్వ‌న‌టుడు కమల్‌ హాసన్‌, ఆయన కుమార్తె శ్రుతి హాసన్‌ చెన్నైలోని ఆల్వార్‌పేటలో క్యూలో నిలుచుని ఓటేశారు. ఇక‌, త‌మిళ స్టార్ హీరో అజిత్‌, ఆయన భార్య షాలినీ, మ‌రో స్టార్ హీరో విజ‌య్‌, `బిచ్చ‌గాడు` హీరో విజ‌య్ కూడా ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com