రేవ్ పార్టీలో 40 మంది అబ్బాయిలు, 20 మంది అమ్మాయిలు

- April 21, 2019 , by Maagulf
రేవ్ పార్టీలో 40 మంది అబ్బాయిలు, 20 మంది అమ్మాయిలు

విశాఖ:విశాఖ రేవ్ పార్టీ కేసులో కీలక నిందితుడు సోనూ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతన్నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా పార్టీల్లో యువతకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న మిగతా ముఠా కోసం వేట కొనసాగుతోంది. వారం కిందట ఆరిలోవ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లోని రుషికొండ బీచ్‌లో జరిగిన రేవ్ పార్టీలో మొత్తం 60 మంది పాల్గొన్నట్టుగా తేలింది. అందులో 40 మంది అబ్బాయిలు కాగా.. 20 మంది అమ్మాయిలు. వీరందరి కోసం గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి.. ఇచ్చినట్టుగా ఎంక్వైరీలో తేలింది. అలాగే రేవ్ పార్టీలకు డాన్సర్లను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారన్న దానిపైనా ఇప్పుడు ఫోకస్ పెట్టి దానిపైనా దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖలో ఈ మధ్య కాలంలో పార్టీ కల్చర్ బాగా పెరిగింది. ఐతే.. పబ్‌లు, హైఫై బార్లలో డ్రగ్స్ సరఫరా కూడా జరుగుతోందన్నది ఓపెన్ సీక్రెట్టే. దీంతో.. మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు సిటీ పోలీసులు. MDMA , కొకైన్, LCD లాంటివి రుషికొండ రేవ్ పార్టీలో దొరికిన నేపథ్యంలో.. గోవా నుంచి వీటిని ఇక్కడకు తెస్తున్న ముఠాలో ఎవరెరు ఉన్నారన్న దానిపై దృష్టి పెట్టారు. ఇప్పటికే కొందరి కాల్ డేటా ఆధారంగానూ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన మానుకొండ సత్యనారాయణను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ పెడ్లర్లతో అతనికున్న సంబంధాలు.. ఇతర నెట్‌వర్క్‌పై పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com