శ్రీలంక పేలుళ్ళను ఖండించిన సుల్తానేట్
- April 22, 2019మస్కట్: అత్యంత కిరాతకంగా జరిగిన వరుస పేలుళ్ళు శ్రీలంకలో పరిస్థితిని భీతావహంగా మార్చేయడంపై ఒమన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పేలుళ్ళను ఖండిస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. తీవ్రవాదం ఏ రూపంలో వున్నా, దాన్ని అంతమొందించాల్సిందేననీ, ఈ కష్టకాలంలో శ్రీలంకకు తాము అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఒమన్ పేర్కొంది. ప్రస్తుతం శ్రీలంకలో వున్న ఒమన్ పౌరుల భద్రత విషయమై అక్కడి ఎంబసీతో మినిస్ట్రీ సంప్రదింపులు జరుపుతోంది. ఈ మేరకు ఫోన్ నెంబర్లను ప్రకటనలో పేర్కొని, అత్యవసర సందర్భాల్లో ఒమన్ పౌరులు, శ్రీలంకలో ఈ నెంబర్లను సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్