శివకార్తికేయన్ ఓటేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం
- April 24, 2019ఓటరు జాబితాలో పేరు లేకున్నా.. తమిళ నటుడు శివకార్తికేయన్ ఓటేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. తమిళనాడులో ఈనెల 18న రెండో దశ పోలింగ్ జరిగింది. ఓటు వేసేందుకు నటుడు శివకార్తికేయన్ దంపతులు వలసరవక్కంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఓటరు జాబితాలో కార్తికేయన్ భార్య ఆర్తి పేరు ఉంది.. కార్తి కేయన్ పేరు మాత్రం గల్లంతైంది. అయినా ఓటేశారు.
అయితే దీనిపై విలేకరులు ప్రశ్నించగా.. ‘ప్రత్యేక అనుమతి తీసుకుని ఓటు వేశానని చెప్పి వెళ్లిపోయారు శివకార్తికేయన్ . అనంతరం, వేలికి సిరా ఉన్న ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశారు . ఇది కాస్త సామాజిక మాద్యమాల్లో వైరల్ అయింది. ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినా ఎలా ఓటు వేశారంటూ ఎన్నికల సంఘం సీరియస్ అయింది. తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి సత్యబ్రత సాహూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అక్కడి పోలింగ్ కేంద్రం అధికారుల తప్పిదమే అంటూ.. వారిపై చర్యలకు ఆదేశింశారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!