ప్లిప్కార్ట్లో 50 వేల ఉద్యోగాలు..
- April 24, 2019ఇ-కామర్స్ దిగ్గజం ప్లిప్కార్ట్ వ్యాపారాన్ని మరింత విస్తరింపజేస్తుంది. లాజిస్టిక్స్ రంగంలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది ప్లిప్కార్ట్. దీనిద్వారా 50,000ల ఉద్యోగాలకు రూపకల్పన జరుగుతుందని ఓ అంచనా. ఇప్పటికే ప్లిప్కార్ట్ని నడిపిస్తున్న వాల్మార్ట్ గురుగ్రామ్, కర్నాటక, పశ్చిమ బెంగాల్లో లాజిస్టిక్స్ పార్క్స్ ఏర్పాటు కోసం 300 ఎకరాల భూమిని సేకరిస్తుంది. భారతదేశంలో ప్రధాన పోటీదారుగా ఉన్న అమెజాన్ను ఢీ కొట్టేందుకు ఈ ప్రణాళికలు ఉపయోగపడతాయని వాల్మార్ట్ భావిస్తోంది. ఈ లాజిస్టిక్ పార్కులు సరుకు రవాణా, పంపిణీ కేంద్రాలుగా పనిచేస్తాయి. ప్లిప్కార్ట్ చేపట్టిన నెక్ట్స్ 200 మిలియన్ కస్ట్మర్స్ ప్రాజెక్టు లక్ష్యాన్ని చేరేందుకు ఈ కొత్త లాజిస్టిక్ పార్కులు తోడ్పడతాయని కంపెనీ అధికార వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ