బుర్జ్‌ ఖలీఫాకి శ్రీలంక జెండా వెలుగులు

- April 26, 2019 , by Maagulf
బుర్జ్‌ ఖలీఫాకి శ్రీలంక జెండా వెలుగులు

దుబాయ్‌లోని ప్రముఖ నిర్మాణం బుర్జ్‌ ఖలీఫా శ్రీలంక జెండా వెలుగులతో దర్శనమిచ్చింది. ప్రపంచంలో శాంతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సహనంతో వ్యవహరించాలని ఈ సదర్భంగా బుర్జ్‌ ఖలీఫా యాజమాన్యం ఆకాంక్షించింది. బుర్జ్‌ ఖలీఫాతోపాటు అబుదాబీలోని ఐకానిక్‌ ల్యాండ్‌ మార్క్స్‌ శ్రీలంక జాతీయ జెండా వెలుగులతో కనిపించాయి. ఎమిరేట్స్‌ ప్యాలెస్‌, షేక్‌ జాయెద్‌ బ్రిడ్జి, అడ్‌నాక్‌ బిల్డింగ్‌, క్యాపిటల్‌ గేట్‌ కూడా శ్రీలంక రంగులతో నిండిపోయాయి. ఈస్టర్‌ ఆదివారం పవిత్ర ప్రార్థనలు చేస్తున్న సమయంలో శ్రీలంకలో తీవ్రవాదులు మారణహోమానికి పాల్పడి దాదాపు 400 మంది ప్రాణాలు బలిగొన్న విషయం విదితమే. 500 మందికి పైగా క్షతగాత్రులు తమ ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇప్పటికీ పేలుళ్ళ టెన్షన్‌ శ్రీలంకలో తగ్గలేదు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com