ఆ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడా?!
- April 28, 2019బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హిజ్రా పాత్రలో నటించబోతున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. తమిళం, తెలుగులో బ్లాక్బస్టర్ విజయం అందుకున్న 'కాంచన' సినిమా బాలీవుడ్లో రీమేక్గా రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమాకు 'లక్ష్మీ బాంబ్' అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమాతో రాఘవ లారెన్స్ దర్శకుడిగా బాలీవుడ్కు పరిచయం కాబోతున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇందులో ప్రధాన పాత్రలో నటించనున్నారు. అక్షయ్కు జోడీగా కియారా అడ్వాణీ నటిస్తారు. అయితే 'కాంచన' చిత్రంలో ప్రముఖ నటుడు శరత్కుమార్ హిజ్రా పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రీమేక్లో అమితాబ్ బచ్చన్ హిజ్రా పాత్రలో నటించేందుకు ఒప్పుకొన్నారని వార్తలు వెలువడుతున్నాయి. అయితే అమితాబ్ పాత్ర గురించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మాధవన్, శోభితా ధూలిపాళ్ల కీలక పాత్రలు పోషించనున్నారు. 2020లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్
- 2 రోజులలో 884 విమానాలు రద్దు