పోలీసుల అదుపులో RGV
- April 28, 2019ఎప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ తనడైన శైలిలో దూసుకుపోతుంటారు రామ్ గోపాల్ వర్మ. ఇటీవల ఆయన నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి గాను నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఆ సినిమాను తెలంగాణలో విడుదల చేసినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్లో వాయిదా వేశారు. ఈ క్రమంలో కోర్టు ఒకే చెప్పడంతో మే 1వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా విడుదల చేయనున్నామని ప్రకటించారు వర్మ.
ఈ మేరకు నేడు (ఆదివారం సాయంత్రం) విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో ప్రెస్మీట్ పెట్టాలని నిర్ణయించారు. అయితే హోటల్ యాజమాన్యం అనుమతి నిరాకరించడంతో నడి రోడ్డుపైనే ప్రెస్మీట్ పెడతానంటూ సంచలన ప్రకటన చేశారు.దీంతో అప్రమత్తమైన పోలీసులు వర్మ ప్రకటన మరి శృతిమించిందని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే కారణంగా రామ్ గోపాల్ వర్మను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్