ముగిసిన ఫార్మర్స్ మార్కెట్
- April 29, 2019బహ్రెయిన్:ఏడవ ఎడిషన్ ఫార్మర్ మార్కెట్ బుడైయాలో ముగిసింది. ఐదు నెలలపాటు ఈ మార్కెట్ జరిగింది. రైతులు, తమ వ్యవసాయ భూముల్లో పండించిన వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇక్కడ ప్రదర్శన మరియు అమ్మకానికి వుంచారు. ప్రతి వారం పెద్ద సంఖ్యలో సందర్శకులు ఈ ఫార్మర్స్ మార్కెట్ని సందర్శించి, వ్యవసాయ ఉత్పత్తుల గురించి తెలుసుకుని, వాటిని కొనుగోలు చేశారు. మినిస్ట్రీ ఆఫ్ మునిసిపల్ ఎఫైర్స్, అగ్రికల్చర్ అండ్ అర్బన్ ప్లానింగ్తో కలిసి నేషనల్ ఇనీషియేటివ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఈ మార్కెట్ని నిర్వహించింది. డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ప్రతి యేడాదీ ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 40 మంది వరకు రైతులు ఈ మార్కెట్లో పాల్గొన్నారు. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్తోపాటు ఈసారి ట్రెడిషనల్ క్రాఫ్ట్స్, రెస్టారెంట్స్, ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మార్కెట్లో రకరకాల ఫెస్టివల్స్ని కూడా నిర్వహించడం గమనార్హం. మల్బరీ ఫెస్టివల్ ఈ ఏడాది ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ