మే 2న తెలంగాణ బంద్
- April 30, 2019తెలంగాణలో ఇంటర్ బోర్డు అరాచకాలపై ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. వచ్చే నెల రెండో తేదీ వరకు పోరాటం కొనసాగిస్తామని అఖిలపక్ష నాయకులు స్పష్టంచేశారు. ప్రభుత్వం ఎంతగా నిర్బంధానికి పాల్పడినా.. తొలిరోజు ధర్నా విజయవంతం అయిందన్నారు. మే ఒకటో తేదీన కొవ్వుత్తుల ర్యాలీకి అఖిలపక్షం ప్లాన్ చేసింది. చనిపోయిన విద్యార్థులకు ట్యాంక్బండ్పై నివాళి అర్పించనున్నారు. మరణించిన ప్రతి విద్యార్థి కుటుంబాన్ని కలుస్తామని నేతలు చెప్పారు.
బీజేపీ కార్యాలయంలో నిన్న దీక్షకు దిగిన ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ను.. పోలీసులు అరెస్టు చేసి.. బలవంతంగా నిమ్స్కు తరలించారు. వైద్యం తీసుకునేందుకు నిరాకరించిన ఆయన.. నిరశన కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి కమలనాథులు కదలనున్నారు. మే 2న తెలంగాణ బంద్కు లక్ష్మణ్ పిలుపిచ్చారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించి.. భవిష్యత్లో రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అటు ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్టూడెంట్ యూనియన్ల నిరసనలు కొనసాగుతున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన