జపాన్‌ నూతన చక్రవర్తి గా నరూహితో పట్టాభిషేకం

- May 01, 2019 , by Maagulf
జపాన్‌ నూతన చక్రవర్తి గా నరూహితో పట్టాభిషేకం

టోక్యో: జపాన్‌ నూతన చక్రవర్తి నరూహితో సింహాసనాన్ని అధిష్ఠించారు . ఈ మేరకు వారసత్వంగా సంక్రమించే ఖడ్గం, నగలు, రాజముద్రలను అందుకున్నారు. పట్టాభిషేక మహోత్సవం అతి కొద్దిమంది ప్రముఖుల మధ్య జరిగింది. కొత్త చక్రవర్తి భార్య సహా రాజవంశానికి చెందిన మహిళలు ఎవరినీ ఈ కార్యక్రమానికి అనుమతించలేదు. ఆ తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి జపాన్ 126వ చక్రవర్తి హోదాలో నరూహితో తొలిసారి ప్రసంగించారు. కొత్త రాజు శకానికి శుభప్రదమైన కాలంగా నామకరణం చేశారు. అక్టోబర్‌ 22న ప్రజల మధ్య కొత్త చక్రవర్తి పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాధినేతలు హాజరై జపాన్‌ కొత్త చక్రవర్తి నరూహితోకు శుభాకాంక్షలు తెలపనున్నారు. 85 ఏళ్ల అకిహితో జపాన్‌ చక్రవర్తిగా వైదొలగడంతో ఆయన కుమారుడు నరూహితో ఈ రోజు సింహాసనాన్ని అధిష్ఠించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com