కన్ఫర్మ్: మహేశ్ కోసం వెంకీ, విజయ్ దేవరకొండ రెడీ
- May 01, 2019మహేశ్ బాబు 25వ చిత్రం'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ జరగనుంది. హైదరాబాద్లోని నెక్లస్రోడ్లో ఈ కార్యక్రమం జరగనుండగా.. దీనికి ముఖ్య అతిథులుగా విక్టరీ వెంకటేశ్, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ రానున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కోసం వెంకటేశ్, మహేశ్ బాబు తొలిసారిగా కలిసి నటించగా.. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో గతంలో మహేశ్ నటించిన 'శ్రీమంతుడు' ఆడియో ఫంక్షన్కు కూడా వెంకటేశ్ చీఫ్ గెస్ట్గా వచ్చిన విషయం తెలిసిందే. కాగా మరోవైపు విజయ్ దేవరకొండ ఇప్పటివరకు చిన్న హీరోల ఫంక్షన్లకు అతిథిగా రాగా.. తొలిసారిగా ఓ పెద్ద స్టార్ నటుడికి గెస్ట్గా మారడం విశేషం.
కాగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన 'మహర్షి' చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటించింది. అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. దిల్ రాజ్, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మహేశ్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం కావడం, ఇప్పటికే రిలీజైన టీజర్ అందరినీ ఆకట్టుకోవడంతో 'మహర్షి'పై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..