అగ్నిప్రమాదంపై రామ్చరణ్ స్పందన
- May 03, 2019హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సెట్లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.2 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సినీ నటుడు రామ్చరణ్ ఫేస్బుక్ వేదికగా వివరణ ఇచ్చారు. ‘దురదృష్టవశాత్తు ‘సైరా’ సెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన కోకాపేట్లో చోటుచేసుకుంది. అదృష్టం బాగుండి ఈ ఘటనలో చిత్రబృందంలోని ఎవ్వరికీ ఏమీ కాలేదు. ఎవ్వరూ గాయపడలేదు. త్వరలో ఆఖరి షెడ్యూల్ చిత్రీకరణను పూర్తిచేయాలని అనుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.
సురేందర్ రెడ్డి ‘సైరా’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా సినిమాను తెరకెక్కిస్తు్న్నారు. ఇందులో నయనతార.. నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ పాత్రను పోషిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, తమన్నా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి: జస్టీస్ చంద్రచూడ్
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్