‘మహర్షి’కి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్

- May 08, 2019 , by Maagulf
‘మహర్షి’కి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ‘మహర్షి’ చిత్రాన్ని 5 షోలు ప్రదర్శించడానికి అనుమతినిచ్చింది. అలాగే ఎగ్జిబిటర్ల అభ్యర్థన మేరకు టిక్కెట్ల రేట్లు పెంచడానికి కోర్టు అంగీకరించింది. తెలంగాణ వ్యాప్తంగా 5 షోలను ప్రదర్శించు కోవడానికి టిక్కెట్ల రేట్లను పెంచుకోవటానికి పర్మిషన్ లభించడంతో థియేటర్ యాజమన్యాలు రెట్లను పెంచడానికి సిద్థమవుతున్నాయి. మల్టీప్లెక్స్‌ల్లో టిక్కెట్ రేటు 200 రూపాయలు సింగిల్ థియేటర్లో గరిష్టంగా 120 రూపాయలు వరకు టికెట్ల రేటు రెండు వారాల పాటు పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com