అగ్ని ప్రమాదం: 13 మంది భారతీయులు క్షేమం
- May 08, 2019షార్జా సివిల్ డిఫెన్స్ ఫైర్ ఫైటర్స్ అత్యంత వేగంగా స్పందించడంతో 13 మంది భారతీయులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఓ బర్నింగ్ కార్గో ధో ఈ అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. ఖాలిద్ పోర్ట్ వద్ద షార్జా క్రీక్లో ఈ ధో యాంకర్ చేయబడింది. 6000 గ్యాలర్ల డీజిల్, 120 ఎక్స్పోర్టెడ్ వెహికిల్స్, 300 వెహికిల్ టైర్స్ ఈ 'ధో'లో వున్నాయి. ఇవన్నీ కాలి బూడిదైపోయినట్లు అధికారులు వెల్లడించారు. షిప్ (ధో) అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి వుంది. రికార్డు సమయంలో ఫైర్ ఫైటర్స్ సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ప్రాణాపాయం సంభవించలేదని షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ కల్నల్ సమి అల్ నక్బి చెప్పారు. ఇదే ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడో సారి. షిప్లోకి కార్గోని ఎక్కించే క్రమంలో మంటలు చెలరేగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!