యూఏఈలో పశ్చిమగోదావరి జిల్లా వాసి మృతి
- May 10, 2019యూఏఈ:యూఏఈలో పశ్చిమగోదావరి జిల్లా వాసి చిలకలపూడి రామకృష్ణ మృతి చెందారు. ఉపాధి నిమిత్తం యూఏఈకి వచ్చిన రామకృష్ణ, ఏడాదిపాటు ఓ క్లీనింగ్ కంపెనీలో విధులు నిర్వహించారు. ఆ తర్వాత అబ్స్కాండ్ అయిన రామకృష్ణ, అనారోగ్యంతో అల్ ఖాసిమిలో చేరినట్లు తెలుస్తోంది. హైపర్ టెన్షన్తో బాధపడుతూ వైద్య చికిత్స పొందిన రామకృష్ణ, దురదృష్టవశాత్తూ హార్ట్ ఎటాక్తో ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు APNRT కో-ఆర్డినేటర్స్ వాసు,విశ్వేశ్వర రావు,ఖాదర్ బాషా మరికొందరు తీవ్రంగా కృషి చేశారు. వీరికి APNRT తోడ్పాటు కూడా అందించడం జరిగింది. మృతుడు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలోగల నిడదవోలుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
తాజా వార్తలు
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష