దుబాయ్‌ మెట్రో: రెండ్రోజుల్లో 80,000 మంది ప్రయాణీకులు

- May 11, 2019 , by Maagulf
దుబాయ్‌ మెట్రో: రెండ్రోజుల్లో 80,000 మంది ప్రయాణీకులు

తొలి రెండు రోజుల్లో అనూహ్యమైన ప్రయాణీకుల రద్దీని చూసింది. మొదటి రెండు రోజుల్లో 80,000 మందికి పైగా ప్రయాణీకులు దుబాయ్‌ మెట్రోని వినియోగించుకున్నారని సంస్థ సోషల్‌ మీడియాలో వెల్లడించింది. తొలి రోజు 37,451 మంది దుబాయ్‌ మెట్రోని వినియోగిస్తే, రెండో రోజు 49,036 మంది ప్రయాణీకులతో దుబాయ్‌ మెట్రో రద్దీగా మారింది. అల్‌ కస్సార్‌ నుంచి అల్‌ వక్రా వరకు రెడ్‌ లైన్‌ ఫస్ట్‌ పార్ట్‌ ప్రారంభమయ్యింది. ప్రతి ఆరు నిమిషాలకు ఓ ట్రైన్‌ ప్రయాణీకులకు అందుబాటులో వుంటోంది. వీకెండ్స్‌లో మెట్రో సేవల్ని నిలిపివేస్తున్నారు. కొత్త స్టేషన్లు లైన్లకు సంబంధించిన వర్క్‌ నిమిత్తం ఈ చర్యలు చేపడుతున్నారు. వీక్‌ డేస్‌లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వీక్‌ డేస్‌లో మెట్రో సేవలు అందుబాటులో వుంటాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com