రసాబాసగా మారిన 'మా' అసోసియేషన్ మీటింగ్
- May 12, 2019మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఇటీవలె ఎలక్షన్ జరిగిన విషయం తెలిసిందే. ప్రముఖ నటుడునరేశ్ ప్యానల్ ఎన్నికయ్యారు. నరేష్ మా అధ్యక్షుడుగా, జీవితరాజశేఖర్ జనరల్సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ రాజీవ్కనకాల, జనరల్ సెక్రటరీ శివబాలీజీ తదితరులు ఈ ప్యానల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మొట్ట మొదటి సారి ఈసీ మెంబర్స్ అందరూ కలిసి నిన్న మీటింగ్ పెట్టుకున్నారని సమాచారం. ఈ సందర్భంగా మా అసోసియేషన్ ఈసీ మెంబర్స్కు జనరల్ సెక్రటరీ అయిన జీవిత రాజశేఖర్ క్షమాపణలు కోరారు.
ఇంతకీ ఆమె క్షమాపణలు కోరాల్సినంత అవసరం ఏమొచ్చిందా అనుకుంటున్నారా... మా అసోసియేషన్కి సంబంధించిన ఫండ్స్ ప్రతి ఒక్కరూపాయి కేవలం మా మూవీ ఆర్టిస్ట్ సంక్షేమం కోసమే వాడాలి. ఆ డబ్బును వేరేవిధంగా ఉపయోగించ కూడదు. కాని ఆమె ఏదో ఎడ్వర్టైజ్మెంట్ కోసమని అక్షరాలా ఏడులక్షల యాభైవేల రూపాయలను వాడారని తెలిసింది. అలా అని అటు ఎడ్వర్టైజ్మెంట్ కూడా ఏమీ లేదు. దీన్ని ఈసీ మెంబర్స్ అందరూ కలిసి గట్టిగా నిలదీస్తే వీలైనంత త్వరలో తను ఆ మొత్తాన్ని ఇచ్చేస్తానని అందుకు అందరూ తనను క్షమించాలని కోరారని సమాచారం.
మరి ఇలా అసోసియేషన్ డబ్బులను దుర్వినియోగం చెయ్యడం ఎంత వరకు న్యాయం. ఆమెను ఇండస్ట్రీలో ఒక కీలక వ్యక్తిగా చేసి ఎన్నికచేసుకున్నందుకు ఆమె చేసే న్యాయం ఇదా. ఎన్నో సినిమా ఫంక్షన్లకు అతిధిగా విచ్చేసి ఎన్నో స్పీచ్లను జనానికి ఇచ్చే ఆవిడ ఇలా చేసి ఉంటదా లేక ఎక్కడయినా ఏదన్నా పొరపాటు జరిగి ఉంటదా అన్నది తెలియాల్సి ఉంది. ఇటీవలె ఒక సినిమా ట్రైలర్ లాంచ్కి గెస్ట్గా వెళ్ళి ఆ ట్రైలర్ కాస్త అసభ్యంగా ఉండడంతో స్టేజ్ మీదే డైరెక్టర్ని కడిగిపారేసినామె అన్ని విషయాల్లోను కరెక్ట్గా ఉండే ఆమె ఇలా చేసి ఉంటదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి ఈ విషయంలో ఇంకా నిజ నిజాలు తెలియాల్సి ఉంది.
అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు నరేశ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు.. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సూపర్ స్టార్ కృష్ణ దంపతులు, కృష్ణం రాజు దంపతులు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ హాజరయ్యారు..వీరితో పాటు 'మా' మాజీ అధ్యక్షుడు, శివాజీ రాజా కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం గమనార్హం.. మా ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేశారు.. ఈ సందర్భంగా 'మా' కోసం కంపోజ్ చేయించిన ప్రత్యేక గీతాన్ని సూపర్ స్టార్ కృష్ణ అయన సతీమణి నిర్మల చేతులమీదుగా విడుదల చేశారు.
తాజా వార్తలు
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!
- మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్ బాబా
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్