'విద్యారంగంలోకి చిరంజీవి' ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు--స్వామి నాయుడు

- May 13, 2019 , by Maagulf
'విద్యారంగంలోకి చిరంజీవి' ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు--స్వామి నాయుడు

మెగాస్టార్ చిరంజీవి విద్యారంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, అందులో భాగంగానే ముందుగా శ్రీకాకుళంలో ఓ స్కూల్ కూడా ఓపెన్ చేసారని కొద్ది రోజులుగా పలు సైట్స్‌లో వార్తలు వస్తున్నాయి. సదరు స్కూల్‌కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అధ్యక్షుడిగా, మెగా బ్రదర్ నాగబాబు ఛైర్మన్‌గా, బాధ్యతలు నిర్వర్తించనున్నారని కూడా అన్నారు. కట్ చేస్తే, దీని గురించి శ్రీకాకుళంలోని 'చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్' యాజమాన్యం వివరణ ఇస్తూ, ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో స్థాపించే సంస్థతో చిరంజీవికి గానీ, ఆయన కుటుంబ సభ్యులకి గానీ ఎటువంటి సంబంధం లేదని చిరంజీవి అభిమాన సంఘాల అధ్యక్షులు స్వామి నాయుడు తెలియజేసారు. అంతేకానీ, ఈ స్కూల్‌కీ, వారికీ ఎటువంటి సంబంధం లేదు అని వివరణ ఇచ్చారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com