తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆర్ఎస్ చౌహాన్ పేరు సిఫార్సు...
- May 14, 2019తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా ఉన్న జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ను..పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఏర్పడిన తర్వాత ప్రధాన న్యాయమూర్తి పదవి కొద్దిరోజులుగా ఖాళీగా ఉన్నందున, జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ను ఆ పదవికి సిఫారసు చేస్తున్నట్టు కొలీజియం పేర్కొన్నది. జస్టిస్ రాధాకృష్ణన్ కలకత్తా హైకోర్టుకు బదిలీ అయినప్పటి నుంచి తెలంగాణ హైకోర్టు సీజే పదవి ఖాళీగా ఉన్నది. రాజస్థాన్ హైకోర్టులో జడ్జిగా పదోన్నతి పొందిన జస్టిస్ చౌహాన్ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గా పనిచేస్తున్నారు.
తెలంగాణ హైకోర్టు సీజే బాధ్యతల నిర్వహణకు జస్టిస్ చౌహాన్ అన్నిరకాలుగా సమర్థుడని కొలీజియం పేర్కొన్నది.
జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ క్రిమినల్, రాజ్యాంగ వ్యవహారాలు, సివిల్ సర్వీసెస్ అంశాల్లో నిపుణుడిగా పేరు తెచ్చుకున్నారు. రాజస్థాన్కు చెందిన 1980లో అమెరికా ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తిచేసిన ఆయన.. 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. అదే ఏడాది రాజస్థాన్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదుచేసుకున్నారు. 2005 జూన్ 13న రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చౌహాన్.. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పడే క్రమంలో తెలంగాణ హైకోర్టుకు ఆప్షన్ ఇచ్చి ఇక్కడే కొనసాగుతున్నారు.
జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ తర్వాత తెలంగాణ హైకోర్టులో రెండో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ వీ రామసుబ్రమణియన్ను హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫారసుచేసింది. తెలంగాణతో పాటు హిమాచల్ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ హైకోర్టులకు కూడా ప్రధాన న్యాయమూర్తులను నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం మరో ముగ్గురు జడ్జీల పేర్లను సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కొలీజియం ఈ నెల 10వ తేదీన చేసిన తీర్మానాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపర్చింది. ఢిల్లీ హైకోర్టుకు జస్టిస్ డీఎన్ పటేల్, మధ్యప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్ ఏఏ ఖురేషీ, హిమాచల్ ప్రదేశ్కు జస్టిస్ వీ రామసుబ్రమణియన్ పేర్లను కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
తాజా వార్తలు
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..