రూ.999కే ఇండిగో భారీ ఆఫర్
- May 15, 2019న్యూఢిల్లీ: బిజినెస్ క్లాస్ ఎయిర్లైన్స్లో ప్రయాణం చేయాలనుకున్నారా? అయితే ఇండిగో మంచి ఆఫర్ ఇచ్చింది. దేశీయ మార్గాల్లో ప్రయాణానికి రూ.999 నుంచి, ఇంటర్నేషనల్ రూట్లలో రూ.3499 నుంచి టికెట్లు బుక్ చేస్తున్నామని ఇండిగో మంగళవారం తాజాగా ప్రకటించింది.
మంగళవారం ప్రారంభమైన అమ్మకాలు గురువారం (ఈనెల 16) వరకు కొనసాగుతాయని తెలిపింది. ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 28 మధ్య ప్రయాణానికి వీటిని వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. దేశంలోని 53 ప్రాంతాలకు, ఇంటర్నేషనల్గా పదిహేడు మార్గాల్లో ఈ ఆఫర్ ఉందని తెలిపింది. మొత్తం 10 లక్షల సీట్లు ఆఫర్ కింద అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.
10 లక్షల సీట్లు ఫర్ సేల్: రూ.999కే ఇండిగో భారీ ఆఫర్
వేసవి సెలవులు ప్రారంభం కావడంతో ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ను ప్రారంభించామని, మే 16 వరకు జరిగే బుకింగ్స్ పైన ఆఫర్ వర్తిస్తుందని సంస్థ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పేర్కొన్నారు. ప్రీపెయిడ్ అధిక బ్యాగేజీపై 30 శాతం వరకు డిస్కౌంట్ ఉంది.
తాజా వార్తలు
- 2 రోజులలో 884 విమానాలు రద్దు
- రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదే..
- జగన్ పై దాడి కేసులో నిందితులు అరెస్ట్
- తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులు మండే ఎండలు
- చిరంజీవి కోసం వంద సార్లు రక్తదానం చేసిన సీనియర్ నటుడు..
- ఇండోనేషియాలో మూడు రోజుల్లో ఐదు సార్లు అగ్నిపర్వతం విస్పోటనం
- ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ మహిళ పోటీ
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి..17 మంది మృతి
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ షురూ..
- నాలుగో విడత లోక్సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల..