ఒమన్‌లో గాయపడ్డ కార్మికుడికి ఇండియన్‌ ఎంబసీ సాయం

- May 17, 2019 , by Maagulf
ఒమన్‌లో గాయపడ్డ కార్మికుడికి ఇండియన్‌ ఎంబసీ సాయం

మస్కట్‌: ఒమన్‌లో గాయపడ్డ భారతీయ వలస కార్మికుడికి సాయం అందించేందుకు ఒమన్‌లోని ఇండియన్‌ ఎంబసీ ముందుకొచ్చింది. ఒమన్‌ హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స పొందుతున్న రాజేంద్రప్రసాద్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది ఇండియన్‌ ఎంబసీ. అలాగే, ప్రసాద్‌కి సాయం అందించేందుకు ఇండియన్‌ కమ్యూనిటీకి చెందిన సోషల్‌ మరియు వెల్ఫేర్‌ వర్కర్స్‌ సాయం చేయాలని కోరింది. ఇండియన్‌ ఎంబసీ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఇండియన్‌ కమ్యూనిటీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామనీ, ఆయనకు సహాయం అందించేందుకు సిద్ధంగా వున్నామని చెప్పారు. రాజేంద్రప్రసాద్‌కి ఇప్పటికే కొన్ని శస్త్ర చికిత్సలు జరిగాయనీ, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుందని వైద్యులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com