పీఎంఎస్బీవై ఇన్సూరెన్స్ స్కీం..
- May 20, 2019ఏ ప్రమాదమూ తెలిసి జరగదు. అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు అక్కరకొస్తాయి ఇన్సూరెన్స్ పాలసీలు. అందుకే జీవిత బీమా, ఆరోగ్య బీమాతో పాటు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలజీ తీసుకుంటే ఉత్తమం. ప్రభుత్వం కూడా సామాజిక భద్రత నేపథ్యంలో పలు స్కీములు అందిస్తోంది. వీటిల్లో ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బావై) ఒకటి. ప్రమాదవశాత్తు మరణం లేదా అంగవైకల్యం సంభవిస్తే ఈ పాలసీ కొంత ఆర్థిక ధైర్యాన్ని ఇస్తుంది.
పీఎంఎస్బావై యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ పాలసీ వ్యవధి సంవత్సరము. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. 18 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. స్కీమ్లో జాయిన్ అయ్యే ముందే ఆటో డెబిట్ ఫెసిలిటీ ఏర్పాటు అంగీకారం తెలపాలి. అంటే మీ అకౌంట్ నుంచి పాలసీ ప్రీమియం ప్రతి ఏడాది ఆటోమేటిక్గా కట్ అవుతుంది. పాలసీ ప్రీమియం ఏడాదికి రూ.12. మే 25 నుంచి 31 మధ్య కాలంలో పాలసీ ప్రీమియం మీ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. జూన్ 1 నుంచి మే 31 వరకు పాలసీ కవర్ వర్తిస్తుంది. ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం ఏర్పడినా రూ.2 లక్షలు లభిస్తాయి. అదే పాక్షిక అంగవైకల్యానికి అయితే రూ.1 లక్ష వస్తుంది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!