హైదరాబాద్ లో మండుతున్న ఎండలు
- May 20, 2019హైదరాబాద్: భానుడు భగభగలాడిపోతున్నాడు. మండుతున్న ఎండలతో ప్రజలపై పగ తీర్చుకుంటున్నాడా అన్నట్లుగా ఉంది నగరంలోని వేడి. కాంక్రిట్ జంగిల్ గా మారిపోయిన హైదరాబాద్ నగరంలో వేసవివచ్చిదంటే చాటు ప్రజలు హడలిపోతున్నారు. 10 దాటికుండానే రోడ్లపై జనాలు కనిపించటంలేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
నగరంలోని పలు ప్రాంతాలలు ఆదివారం (మే19) 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ స్టేట్ డెవెలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ( TS DPP) తెలిపిన వివరాల ప్రకారం..బహదూర్ పురాలు 43.8 డిగ్రీలు..అమీర్ పేట 43.4, మాదాపూర్ 43.2, బీహెచ్ఈఎల్ 43.1 డిగ్రీలు,ఉష్ణోగ్రత 42.7 సెల్షియస్ గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా మరో మూడు రోజుల పాటు వడగాలులు వీస్తాయని వాతారవణ శాఖ తెలిపింది.
మరోవైపు రాష్ట్రంలో భద్రాచలం, ఖమ్మం, రామగుండం, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో 44 డిగ్రీల చొప్పున అధిక టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, నల్గొండ, హన్మకొండ జిల్లాల్లో 43 డిగ్రీలు చొప్పున రికార్డయ్యాయి.
తాజా వార్తలు
- ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు
- దుబాయ్ ఆర్టీఏ బస్సు ఉల్లంఘనలు.. జరిమానాల జాబితా
- నితాఖత్ కింద సౌదీలుగా ఫారీన్ ఇన్వెస్టర్లు
- డొమెస్టిక్ లేబర్ ప్రొబేషన్ వ్యవధి 6 నెలలకు పెంపు..!
- అబుదాబిలోని అత్యంత ఖరీదైన పెంట్హౌస్ సేల్
- కువైట్ లో పెరుగుతున్న ఎలక్ట్రికల్ లోడ్ ఇండెక్స్..!
- ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అప్లికేషన్లలో 12.59% పెరుగుదల
- హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..
- ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 128.79 కోట్ల నగదు సీజ్ చేశాం: ఈడీ
- విదేశీ బ్యాంకుల పై 20% కొత్త పన్ను.. కస్టమర్లు ఎక్కువ చెల్లించాలా?