ఆకస్మిక వరదల్లో ఓ కుటుంబం గల్లంతు
- May 20, 2019ఒమన్లో భారీ వర్షాల కారణంగా చోటు చేసుకున్న ఆకస్మిక వరదల్లో ఓ కుటుంబం గల్లంతయ్యింది. వారు ప్రయాణిస్తున్న కారు వరదలో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వారంతా భారతదేశానికి చెందినవారని అధికారులు అంటున్నారు. వాడి బని ఖాలిద్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 28 రోజుల పసికందు కూడా గల్లంతవడం గమనార్హం. రెస్క్యూ టీమ్స్, వారు ప్రయాణిస్తున్న వాహనానికి సంబంధించిన శకలాల్ని కనుగొన్నప్పటికీ, బాధిత కుటుంబం ఆచూకీ మాత్రం తెలుసుకోలేకపోయారు. సర్దార్ ఫజల్ అహ్మద్ అనే వ్యక్తికి చెందిన కుటుంబం ఈ వరదల్లో గల్లంతయ్యింది. వరదల సమయంలో తాను ఎలాగో ఓ చెట్టుని పట్టుకుని ప్రాణాలు నిలుపుకున్నట్లు తెలిపారాయన.
తాజా వార్తలు
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్