హీరోగా శ్రీహరి చిన్న కొడుకు
- May 21, 2019విలన్గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన నటుడు స్వర్గీయ, రియల్ స్టార్, డా. శ్రీహరి.. కెరీర్ ఫుల్ స్వింగ్లో ఉండగా 49 ఏళ్ళ వయసులో తిరిగిరాని లోకాలకు తరలి వెళ్ళిపోయారు. తెరమీదే కాదు, తెర వెనక కూడా ఆయన రియల్ స్టారే.. పేదలకు సాయం, గ్రామల దత్తత వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారు శ్రీహరి.. ఆయన మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు.. ఇప్పుడు శ్రీహరి ఇంటినుండి మరో నటుడు తెరంగేట్రం చెయ్యనున్నాడు..
శ్రీహరి, డిస్కో శాంతి దంపతులకు శశాంక్, మేఘాంశ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. చిన్న కొడుకు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటించిన భైరవ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం అయ్యాడు. ఆ సినిమాలో మేఘాంశ్ నటనకు మంచి స్పందన వచ్చింది. తండ్రి మరణం, స్టడీస్ కారణంగా కొంత గ్యాప్ తీసుకున్న మేఘాంశ్, నటనకు సంబంధించిన అన్ని రంగాలలో శిక్షణ తీసుకుని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మేఘాంశ్ మొదటి సినిమాని కార్తీక్ - అర్జున్ కలిసి డైరెక్ట్ చెయ్యనుండగా, ఈ సినిమాకి 'రాజ్ దూత్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. త్వరలో ఈ సినిమా ప్రారంభంకానుంది.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్