ఇల్లీగల్ ఫొటోగ్రఫీ: 5000 దిర్హామ్ల జరీమానా
- May 22, 2019యూ.ఏ.ఈ:అరబ్ కాలేజ్ స్టూడెంట్ ఒకరికి 5000 దిర్హామ్ల జరీమానా విధించింది అబుదాబీ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్. నిషేధిత ప్రాంతంలో ఫొటోలు తీసినందుకుగాను న్యాయస్థానం ఈ జరీమానా విధించినట్లు కోర్టు రికార్డ్స్ చెబుతున్నాయి. కేవలం తన హాబీలో భాగంగానే ఫొటోలు తీశాను తప్ప, నిషేధిత ప్రాంతమనే విషయం తనకు తెలియదంటూ నిందితుడు అప్పీల్స్ కోర్టుని ఆశ్రయించాడు. తనకు విధించిన జరీమానాని రద్దు చేయాలని అప్పీల్ కోర్టుకి విజ్ఞప్తి చేశాడు నిందితుడు. తన ట్యూషన్ మనీని జరీమానాగా చెల్లించాననీ, ఈ నేపథ్యంలో తాను చెల్లించిన జరీమానాని తిరిగి ఇప్పించాలని కోర్టును కోరాడు నిందితుడైన విద్యార్థి. అయితే న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.
తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్
- గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి
- గ్లోబల్ విలేజ్ బంపరాఫర్..ఇక వారికి ఉచితం..!
- 3వేలకు పైగా చిల్డ్రన్ స్వీట్స్ సీజ్
- బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- వారికి వీసా ఓవర్స్టే జరిమానాలు లేవు..!
- 'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- సుడాన్ ఆరోపణలను ఖండించిన యూఏఈ
- నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి: ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి