మక్కా, జెడ్డాపై మిస్సైల్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- May 22, 2019యెమెన్కి చెందిన తీవ్రవాదులు సౌదీ అరేబియాలోని మక్కా మరియు జెడ్డాపై దాడి కోసం మిస్సైల్స్ ప్రయోగించడాన్ని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఫారిన్ మినిస్ట్రీ ఓ ప్రకటన విడుదల చేసింది. తీవ్రవాదం ఏ రూపంలో వున్నా దాన్ని సమర్థించకూడదని, ప్రపంచమంతా ఏకమై తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సి వుందని బహ్రెయిన్ పేర్కొంది. అత్యంత చాకచక్యంగా మిస్సైల్స్ని డిస్ట్రాయ్ చేసిన సౌదీ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ని ఈ సందర్భంగా బహ్రెయిన్ అభినందించింది. సౌదీ అరేబియాకి బహ్రెయిన్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందనీ, ఇస్లామిక్ సమాజం అంతా ఈ విషయమై ఒక్కతాటిపైకి రావాలని బహ్రెయిన్ పిలుపునిచ్చింది. తైఫ్ మీదుగా వస్తున్న మిస్సైల్స్ని సౌదీ డిఫెన్స్ ఫోర్సెస్ ధ్వంసం చేశాయి. మిస్సైల్ శకలాలు వాడి జలీల్లో కూలిపోయాయి. కాగా, యెమనీ ప్రభుత్వం కూడా ఈ దాడుల్ని ఖండించింది. పవిత్ర నగరాలపై దాడులకు దిగడం ద్వారా తీవ్రవాదులు తమ హీనత్వాన్ని చాటుకున్నారని యెమెన్ వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..