డిగ్రీ అర్హతతో ‘ఈపీఎఫ్‌వో’లో ఉద్యోగాలు..

- May 22, 2019 , by Maagulf
డిగ్రీ అర్హతతో ‘ఈపీఎఫ్‌వో’లో ఉద్యోగాలు..

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మే 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జూన్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
పోస్టులు: 280………..  జనరల్ : 113  ఈడ్ల్యూఎస్: 28  ఎస్సీ: 42  ఎస్టీ: 21  ఓబీసీ (ఎన్‌సీఎల్): 76. 11 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.  వయసు: 25.06.2019 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళలు, దివ్యాంగులు, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా  ఎంపిక: ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా  జీతం: రూ.44,900. ఇతర అలవెన్సులు అదనం
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 30.05.2019  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.06.2019  ప్రిలిమినరీ పరీక్ష: జులై 30, 31 తేదీల్లో
మెయిన్స్ : ప్రిలిమినరీ రిజల్ట్ వచ్చిన తరువాత ప్రకటిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com