ఈనెల 30న ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణస్వీకారం
- May 23, 2019ఎన్నికల ఫలితాల్లో వైసీపీ విజయం దిశగా దూసుకెళుతుండడంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. ఎల్లుండి వైసీపీ శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో జగన్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు గెలిచిన ఎమ్మెల్యేలు. అలాగే ఈనెల 30న జగన్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు వైసీపీ స్పష్టమైన మెజారిటీ దిశగా వెళుతున్నట్టు కనిపించడంతో తాడేపల్లిలో జగన్ నివాసం వద్ద కార్యకర్తల కోలాహలం నెలకొంది. ఫలితాలు చూస్తున్న జగన్.. ఎంపీ విజయసాయిరెడ్డిని ఆనందంతో ఆలింగనం చేసుకున్నారు. ఫలితాలు అనుకూలంగా వస్తుండటంతో వైసీపీ అధినేత జగన్ విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి ఫోన్ చేశారు. దీంతో స్వామిజి జగన్ ను అభినందనించారు. ఫలితాలపై ఇవాళ సాయంత్రం మీడియాతో మాట్లాడనున్నారు జగన్.
తాజా వార్తలు
- జగన్ పై దాడి కేసులో నిందితులు అరెస్ట్
- తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులు మండే ఎండలు
- చిరంజీవి కోసం వంద సార్లు రక్తదానం చేసిన సీనియర్ నటుడు..
- ఇండోనేషియాలో మూడు రోజుల్లో ఐదు సార్లు అగ్నిపర్వతం విస్పోటనం
- ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ మహిళ పోటీ
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి..17 మంది మృతి
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ షురూ..
- నాలుగో విడత లోక్సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల..
- ఆన్లైన్ క్లాసెస్ మరో రెండు రోజులు పొడిగింపు
- BD97,000 దుర్వినియోగం..బహ్రెయిన్లో అరబ్కు జైలుశిక్ష