బీజేపీ గెలుపుతో యూఏఈలోని భారతీయుల సంబరాలు
- May 23, 2019భారతదేశంలో పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో యూఏఈలోని భారతీయులు ఉదయం నుంచే ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూశారు. ఎర్లీ ట్రెండ్స్ బీజేపీకి అనుకూలంగా వుండడంతో భారతీయ వలసదారులు యూఏఈలో సంబరాలకు రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీ గెలుపు ఖాయమైందన్న అవగాహనకు వచ్చాక సంబరాలు షురూ చేశారు. ఎన్ఎంసి ఫౌండర్ బిఆర్ శెట్టి, బీజేపీ గెలుపుపై స్పందిస్తూ, నరేంద్రమోడీ నేతృత్వంలో భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్గా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు. బీజేపీ గెలుపు పై సజివ్ పురుషోత్తమన్(బి.జె.పి NRI కో-ఆర్డినేటర్) హర్షం వ్యక్తం చేసారు.ఇండియన్ లేడీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్ను చౌరారియా మాట్లాడుతూ, మోడీని విజనరరీ లీడర్గా అభివర్ణించారు. దేశాభివృద్ధికి ఈ ఎన్నికలు ఎంతగానో దోహదం చేస్తాయని దీపక్ కుమార్ దాస్ అనే ఒరిస్సాకి చెందిన వ్యక్తి చెప్పారు. కాగా, కొందరు వలసదారులు కాంగ్రెస్ విజయాన్ని ఆకాంక్షించారు. వారంతా నిరాశలో మునిగిపోయారు.
తాజా వార్తలు
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్
- గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి