ఇండియన్ టైకూన్ని సత్కరించిన షేక్ హమదాన్
- May 24, 2019దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ల్యాండ్ మార్క్ గ్రూప్ని ఫస్ట్ స్పోర్ట్స్ ఇంప్రింట్ అవార్డ్తో సత్కరించారు. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ మరియు వతానీ అల్ ఎమరాత్ ఫౌండేషన్ సహకారంతో ఈ అవార్డుని అందించారు. నాద్ అల్ షెబా స్పోర్ట్స్ టోర్నమెంట్ సందర్భంగా ఈ అవార్డు ప్రధానోత్సవం జరిగింది. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఛైర్మన్ కూడా అయిన షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఈ సందర్భంగా ల్యాండ్ మార్క్ గ్రూప్ ఛైర్మన్ మిక్కీ జగితియానీని సత్కరించారు. బెస్ట్ డయాబెటిస్ వాక్ పేరుతో డయాబెటిస్ పట్ల అవగాహన కలిగించేందుకు ల్యాండ్ మార్క్ సంస్థ చేపట్టిన కార్యక్రమాల్ని అభినందించారు షేక్ హమదాన్. 20,000 మందికి పైగా పార్టిసిపెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ అలాగే ఎమిరేట్స్ డయాబెటిస్ సొసైటీకి మద్దతుగా ల్యాండ్ మార్క్ పలు కార్యక్రమాలు చేపడుతోంది.
తాజా వార్తలు
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు