కాబూల్‌లో బాంబు దాడి.. ఇద్దరి మృతి

- May 24, 2019 , by Maagulf
కాబూల్‌లో బాంబు దాడి.. ఇద్దరి మృతి

ఆఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌ సమీపంలోని పక్టియాకోట్‌ ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 9 మందికి గాయాలైనట్లు సమాచారం. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ప్రార్థనా మందిరంలో శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఒకరు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మత గురువు ఇమామ్‌తో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అయితే బాంబు దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు ప్రకటన చేయలేదు. ఈ ప్రాంతంలో ఎక్కువగా సున్నీలు ఉంటారు. వీరిలో చాలామంది తాలిబన్లకు అనుకూలంగా ఉంటారు’’ అని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com